calender_icon.png 1 June, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వద్ద మహా ధర్నా

13-03-2025 01:43:11 AM

 వైరా, మార్చి 12, విజయ క్రాంతి  : సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల స్థానిక సమస్యలను పరిష్కరించాలని  పోరుబాట పట్టారు. సిపిఐ(ఎం)  వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గత 20 రోజులు మున్సిపాలిటీ పరిధిలో నాయ కులు కార్యకర్తలు  సర్వే నిర్వహించారు. ప్రజలనుండి పలు రకాల సమస్యలను తెలుసుకున్నారు.. మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం వైరా మున్సిపాలిటీ వద్ద వందల సంఖ్యలో ప్రజలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  మున్సిపాలిటీలో బారీగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని, ఇందిరమ్మ కాలనీ వద్ద వాగుకు కరకట్ట నిర్మాణం చేపట్టాలని, పల్లిపాడు డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద,  గంధం టవర్స్ వద్ద శాశ్వత సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

కమీషనర్ వేణు కు సమస్యల వినతిని అందించారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని, మిగిలిన సమస్యలను పై అదికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, కొండబొయన నాగేశ్వరావు, దిగ్గి కృష్ణ, మచ్చ మణి, తోట నాగేశ్వరావు, చెరుకుమల్లి కుటుంబరావు, దొంతెబొయిన నాగేశ్వరరావు, బాణాల శ్రీనివాసరావు, తూము సుధాకర్, బొంతు సమత, గుడిమెట్ల రజిత, కొంగర సుధాకర్, హరి వెంకటేశ్వరరావు, గుడిమెట్ల మోహన్ రావు, పైడిపల్లి సాంబశివరావు, రాచభంటి భత్తిరన్న, అనుమొలు రామారావు, తోట కృష్ణవేణి, కామినేని రవి, మల్లెంపాటి రామారావు, కురుగుంట్ల శ్రీనివాసరావు, అమరనేని కృష్ణ, మల్లేంపాటి ప్రసాదరావు, సంక్రాంతి పురుషోత్తం, కంసాని మల్లికాంబ, ఒర్సు సీతారాములు, యనమద్ది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.