8 May, 2026 | 3:05 PM

Breaking News

ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన.. ఉర్దూ పోస్టర్‌ ఆవిష్కరణ   •   తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో ప్రాణహిత జలాలకు వినియోగం: మంత్రి జూపల్లి కృష్ణారావు   •   పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత   •   పుల్లాయిగూడెం నూతన రామాలయం ప్రారంభోత్సవం   •   కొడంగల్‌లో శ్రీవేంటేశ్వర స్వామి ఆలయానికి సీఎం భూమిపూజ   •   జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య   •   ఎస్ పీఎల్ క్రికెట్ విజేతకు లక్ష నగదు, ట్రోఫీ అందజేత   •   రాస్తారోకో నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు   •   వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోగలరు: ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి   •   కొలనూరు చెరువు వద్ద రైతు వారోత్సవాలు నిర్వహణ   •  

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

09-09-2025 03:04 PM

 ఏఓ బోగేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్

చేర్యాల: రైతులు(Farmers ) యూరియా కోసం విసుగు చెంది రోడ్డు ఎక్కిన పరిస్థితి మంగళవారం చేర్యాల పట్టణంలో జరిగింది.వివరాల్లోకి వెలితే నాయకులకు చాటుగా టోకెన్లు ఏఓ బోగేశ్వర్ ఇస్తున్నాడని ఇలా చేయడం వల్ల సామాన్య రైతులకు యూరియా దక్కడం లేదని ఆవేదన చెంది చేర్యాల పట్టణలో నేషనల్ హైవే పై ధర్నా చేశారు.గత కొన్ని రోజుల నుంచి తిరుగుతున్నా కూడా మాకు టోకెన్లు ఇవ్వడం లేదని ఇచ్చినా కూడా యూరియా ఐపోయింది అని అంటున్నారు అని రైతులు తెలుపుతు ఏఓ బోగేశ్వర్ పైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న జిల్లా వ్యవస్యాయ అధికారిని రాధిక రైతులతో మాట్లాడుతు ఇప్పటినుంచి అందరికి యూరియా బస్తాలు అందేవిధంగా చూస్తా అని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.