28-06-2025 12:31:18 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కే.వీర బ్రహ్మచారి, మున్సిపల్ కమిషనర్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తీరుపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల వారిగా అప్రూవల్ ఐ ఉన్న ఇండ్ల దరఖాస్తులను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతిష్ట చర్యలు
మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రత ప్రమాదాలపై తీసుకోవాల్సిన నివారణ చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, జనం ఎక్కువగా సంచరించే స్థలాలను, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలల వద్ద స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయాలని ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద రోడ్డు విస్తరణ చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణ కోసం పట్టణాల్లో సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో జిల్లా ముందుండాలి
స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2025 అమలులో మహబూబాబాద్ జిల్లా ముందంజలో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ కూడా మురుగునీరు నిలవకుండా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. ఎస్ ఎస్ జి పారామీటర్స్ సరిగా ఉండాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డి.ఎస్.పి తిరుపతిరావు, ఆర్ అండ్ బి ఈ ఈ భీమ్లా, డిఇఓ డాక్టర్ రవీందర్ రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు నరసింహస్వామి శ్రీనివాసరావు, మండలాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.