2 July, 2026 | 4:10 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

మహాత్మా బసవేశ్వర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం

01-05-2025 12:23 AM

అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్

ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జిల్లా కలెక్టరేట్లో బుధవారం బసవేశ్వర జయంతి వేడుక లు అధికారికంగా ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భం గా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, బసవేశ్వ ర మహారాజ్ నాటి కాలంలోనే సమాజంలో అసమానతలను తొలగించి సమానత్వాన్ని నెలకొల్పేందుకు నిరంతరం కృషి చేశారని అన్నారు. మహిళల హక్కుల కోసం పోరాడిన విప్లవాత్మక నాయకుడుగా ఆయనను కొనియాడారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వర ఆలోచనలు, విలువలను అనుసరించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, సీపీఓ జీవరత్నం, ఎస్సి కార్పొరేషన్ ఈ డి శంకర్,  పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, డీపీఆర్ ఓ విష్ణు డీపీఎం శోభారాణి బీసీ సంక్షేమ శాఖ అధికారులు కాలిద్ సత్యనారాయణ రెడ్డి  అధికారులు, వీరశైవ లింగాయత్ ప్రతినిధులు, లక్ష్మణ్ రమేష్ పటేల్ సిబ్బంది, రమేష్ షాహిబ్ రవికుమార్ పాల్గొన్నారు.