11 April, 2026 | 7:25 PM

సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే

11-04-2026 05:49 PM

- మండల బీసీ సంఘం అధ్యక్షుడు నేరేళ్ల సంతోష్.

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మహాత్మ జ్యోతిభాపూలే 199 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నేరేళ్ల సంతోష్ మాట్లాడుతూ ప్రజలకు చైతన్య వంతులు చేయడానికి ఉచిత విద్యను అందించి సత్యశోదక సమాజాన్ని స్థాపించి అంటారని తనం నిర్మూలనకు కృషి చేసి సమ సమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శులు రవి, రాజు, పట్టణ ఉపాధ్యక్షుడు శివ, కార్యదర్శి రమేష్, యూత్ అధ్యక్షుడు నితిన్, ఉపాధ్యక్షుడు నవీన్, కార్యదర్శి సత్యం, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.