31-07-2025 01:05:54 AM
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): ఉద్యోగస్తులకు కాంగ్రెస్ ప్రభు త్వం అండగా ఉంటుందని పీసీసీ అధికార ప్రతినిధి, భూ భారతి ఎఫ్టీఎస్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొనగాల మహేశ్ అన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డిని మహేశ్ బుధవారం సీసీఎల్ఏ కార్యాలయంలో కలిసి శుభాకాం క్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు.