10 April, 2026 | 7:22 PM

Breaking News

దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రెండవ రాష్ట్ర మహాసభలు   •   మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •  

పి.ఓ.డబ్ల్యూ రాష్ట్ర శిక్షణ తరగతులను జయప్రదం చేయండి

15-10-2025 07:10 PM

నకిరేకల్ (విజయక్రాంతి): ఈ నెల 17, 18న నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ భవనంలో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం(పి.ఓ. డబ్ల్యూ) తెలంగాణ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలనీ ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు బూరుగు లక్ష్మి కోరారు. బుధవారం నకిరేకల్ పట్టణoలోని మెయిన్ సెంటర్ లో శిక్షణ తరగతుల కరపత్రాలను ఆమె ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పి.ఓ.డబ్ల్యూ సంస్థ మహిళా సమస్యలపై, స్త్రీ, పురుష సమానత్వం కోసం గత 50 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు.

మద్యం, గంజాయి, డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలను అరికట్టాలని దశబ్దాలగా ఆందోళనలు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. హింసకు కారనమైన మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ తరగతులకు రాష్ట్ర నలుమూలల నుండి 150 మంది మహిళా ప్రతినిధులు పాల్గొంటారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మర్రి సంతోష, పుష్ప, రాణి, ఎల్లమ్మ, ఎస్ కె సైదా, వెంకటమ్మ, స్వరూప, నాగమణి, యాదమ్మ, అమ్ములు తదితరులు పాల్గొన్నారు.