మల్లన్న హుండీ ఆదాయం రూ.90 లక్షలు
16-05-2025 12:00 AM
చేర్యాల, మే 15 ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ లెక్కింపు ను ఆలయ వర్గాలు గురువారం చేపట్టాయి. లెక్కింపులో రామకృష్ణ భజన మం డలి వారు పాల్గొన్నారు. 48 రోజులకుగాను రూ. 90 లక్షల 9 వేల 170 రూపాయలు నగదు రాగా, మిశ్రమ బంగారం 96 గ్రాములు, మిత్రమా వెండి 9 కిలోల 50 గ్రాములు, విదేశీ కరెన్సీ 22నోట్లు, మిశ్రమ బియ్యం 14 క్వింటాళ్లు లభించినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ అన్నపూర్ణ తెలిపారు.
దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి పర్యవేక్షణలో లెక్కింపు కొనసాగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లి కార్జున్, ఆలయ సిబ్బంది బుద్ధి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి పాల్గొన్నారు.






