28 July, 2026 | 1:50 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

కాంగ్రెస్ పార్టీలో చేరిన మామిడిపల్లి సర్పంచ్

18-12-2025 08:03 PM

పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర..

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి నూతంగా ఎన్నికైన సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర వార్డు సభ్యులు బెదిరే మహిపాల్, కులేరి రవి, నంద్యాడపు రజిత, లోకుర్తి శంకర్ లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ సందర్భంగా వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశీ వారిని ఘనంగా సత్కరించారు. గ్రామాలతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నూతన పాలకవర్గానికి తన వంతు సహాయ సహకారలు అందిస్తామని తెలిపారు.