15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

తంగళ్ళపల్లి ఐకెపి కేంద్రంలో 9,600 క్వింటాళ్ల వరి కొనుగోలు పూర్తి

18-12-2025 08:01 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ఐకెపి కేంద్రంలో ఈరోజు దాదాపు 9,600 క్వింటాళ్ల వరి కొనుగోలు విజయవంతంగా పూర్తయ్యింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సజావుగా నిర్వహించడంతో ఐకెపి కేంద్రం నిర్వాహకులను రైతులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ నేరళ్ల నర్సింగం గౌడ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, ఐకెపి సెంటర్ మహిళా సోదరులు గుడ్డి రేణుక, శైలజతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నర్సింగం లారీ డ్రైవర్‌ను శాలువాతో సన్మానించి, వరి రవాణా సకాలంలో జరిగేలా సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.