01-12-2025 09:08:28 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం(Rajendra Nagar) మైలార్ దేవ్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఫైనాన్సియర్ల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్సియర్లు(financiers) జాహంగీర్, సోహైల్ వద్ద షేక్ ఇమ్రాన్ ఫైనాన్స్ తీసుకున్నాడు. వడ్డీ డబ్బు ఎందుకు ఇవ్వలేదని జహంగీర్, సోహైల్ ఇమ్రాన్ ను నిలదీశారు. అవమానం తట్టుకోలేక షేక్ ఇమ్రాన్ ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.