calender_icon.png 30 May, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరోనాతో మరో వ్యక్తి మృతి.. ఎక్కడంటే

28-05-2025 08:53:30 PM

ఛండీగఢ్: కరోనా మహమ్మారి(Corona Pandemic) మళ్లీ కలకలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా మళ్లి రూపం మార్చుకొని విస్తరించడంతో దేశవ్యాపంగా పలు నగరాల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజా ఛండీగఢ్ లో బుధవారం కరోనా వైరస్(Coronavirus)తో మరో వ్యక్తి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా జ్వరం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ 40 ఏళ్ల రోగిని మంగళవారం లూధియానా నుంచి ఛండీగఢ్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో చేరారు. అతడి పరీక్షించిన వైద్యులు ఆ రోగికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేల్చారు. ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ ఇవాళ రోగి మృతి చెందినట్లు జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ థామి వెల్లడించారు.