30-06-2025 03:32:06 AM
* మాజీ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ విమర్శలతో కాంగ్రెస్ ప్రతిష్టకు సవాల్
* నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు
* విజయక్రాంతి’ స్పెషల్
హుస్నాబాద్, జూన్ 29 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ని యోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక్ప మాజీ ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ నేత వొడితల సతీశ్ కుమార్ చేసిన తీవ్ర విమర్శలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావన ను పెంచుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సతీశ్ కుమార్ మీడియా సమావేశం కేవలం ఒక రాజకీయ దాడిగా కాకుండా, మంత్రి పొన్నం ప్రభాకర్ పాలన తీరు, హా మీల అమలులో ఆయన నిబద్ధతపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు అద్దం పడుతోందని అభిప్రాయపడుతున్నారు. ‘షో పుటప్‘లు, ‘పీఆర్ స్టంట్స్‘తో మంత్రి కాలం వెల్లబుచ్చుతున్నారన్న సతీశ్ కుమార్ వ్యాఖ్యలు ప్రజల్లో మంత్రిపైనే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనే నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయంటున్నారు.
హామీల అమలులో వైఫల్యమా?
సతీశ్ కుమార్ ప్రస్తావించిన ముఖ్యమైన అంశాలు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీల అమలులో వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. మెడికల్ కాలేజీ ఏర్పాటుపై మంత్రి మాట తప్పారన్న విమర్శలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇచ్చిన హామీని ఇప్పుడు సాధ్యం కాదని మంత్రి మాట మార్చడం, ‘మంత్రి తలుచుకుంటే మెడికల్ కాలేజీ రాదా?‘ అన్న సతీశ్ కుమార్ సూటి ప్రశ్న ప్రజల సందేహాలనే ప్రతిబింబిస్తోంది.
మెడికల్ కాలేజీ లేకుండా పీజీ సెంటర్ ఎలా సాధ్యమన్న అనుమానం, బీఆర్ఎస్ హయాం లో వచ్చిన వైద్య కళాశాలలు, సీట్ల సంఖ్యను పోలుస్తూ ప్ర స్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2000 ఎంబీబీఎస్ సీట్లు కో ల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించడం కాంగ్రెస్ పాలన తీరుపై తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా, గౌరవె ల్లి ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం ప్రజాగ్రహానికి దారితీస్తోంది. ఎన్నికల ముందు నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన ప్రాజెక్టు, ఏడాదిన్నర గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం మంత్రి చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది.
గతంలో బీఆర్ఎస్ పనులు చే స్తుంటే కాంగ్రెస్ నాయకులు కేసులు వేయించి అడ్డుకున్నారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఆ కేసులను క్లోజ్ చే యించకపోవడం రాజకీయ లబ్ధి కోసమేనన్న అనుమానాలకు తావిస్తోంది. భూసేకరణలో రైతులను మోసం చేశారన్న ఆరోపణలు, హామీ ఇచ్చిన రూ. 30 లక్షలకు బదులు రూ. 17 లక్షలే ఇస్తున్నారని సతీశ్ కుమార్ స్పష్టం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతోంది. గౌరవెల్లి ప్రాజెక్టులో కనీసం ఎండకాలంలోనైనా నీటిని నింపాలన్న విజ్ఞప్తిని పట్టించుకోకపోవడం భూగర్భజలాల సమస్యను తీవ్రతరం చేస్తుం దని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
‘నా పనులు, మీ ప్రచారం’పై స్పందించని మంత్రి
సతీశ్ కుమార్ చేసిన ఆరోపణల్లో అత్యంత కీలకమైన అం శం - తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఖాతాలో వేసుకుంటున్నారని స్పష్టం చేయడం. 150 పడకల ఆసుపత్రి, మాతాశిశు ఆసుపత్రి, ము న్సిపల్, ఏసీపీ ఆఫీసులు, ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్స్, వివిధ శాఖల కార్యాలయాలు, హైవే ప్రతిపాదన, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ వంటి అనేక పనులను తాను ప్రారంభించానని, కొన్ని పూర్తి చేశానని, కొన్ని ప్రతిపాదించానని సతీశ్ కుమార్ మీడియా ముందు వివరించారు. ఈ పనులను మంత్రి తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని ఆయన వ్యాఖ్యానించ డం ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాం ప్లెక్స్ సెకండ్ ఫ్లోర్ నిర్మాణంలో ఏడాదిన్నరగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదని విమర్శించడం, కేవలం ప్రారంభోత్సవాలకే మంత్రి పరిమితమవుతున్నారని పరోక్షంగా చెప్పకనే చెబుతోంది.
అంబులెన్స్ పేరుతో డబ్బులు తిన్నదెవరు?
సతీశ్ కుమార్ లేవనెత్తిన అంబులెన్స్ నిధుల వివాదం ఇప్పుడు హుస్నాబాద్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హుస్నాబాద్ ఆసుపత్రిలో అంబులెన్స్ లేదని మంత్రి వెంట ఉండే, ఆయన ప్రచారం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ఒక నాయకుడు ప్రజల వద్ద నుంచి చందాలు వసూలు చేశాడని, ఆ డబ్బులు ఏమయ్యాయో మంత్రి చెప్పాలని సతీశ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు.
అంబులెన్స్ కోసం డబ్బులు వసూలు చేసి, అంబులెన్స్ ఎందుకు తేలేదో చెప్పాలని డి మాండ్ చేశారు. మంత్రి అయిన తర్వాత ఒక్క అంబులెన్స్ కూ డా తేలేదన్నారు. ఈ ఆరోపణలు కేవలం నిధుల పారదర్శకతపైనే కాదు, అంబులెన్స్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేసి న డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి అన్న తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఈ వివాదం మంత్రి విశ్వసనీయతకు మరింత భంగం కలిగిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజాగ్రహానికి గురికానున్న కాంగ్రెస్?
‘నువ్వొక వెధవవు. చేతగానోడివని రుజువైంది‘ అంటూ సతీశ్ కుమార్ ఉపయోగించిన తీవ్ర పదజాలం, మంత్రిపై ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహానికి ప్రతీక అని అంటున్నారు. రుణమాఫీ, రైతుభరోసా, ఆరు గ్యారెంటీలు వంటి కీలక హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, దీనికి తోడు మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహారశైలి, హామీల అమలులో వైఫల్యం, అభివృద్ధి పనుల క్రెడిట్ వివాదం, అంబులెన్స్ నిధులపై సందేహాలు - ఇవన్నీ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేక భావనను బలంగా నాటుతున్నాయని చెబుతున్నారు.
ఈ పరిణామంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక తీవ్ర పరీక్షా సమయంగా మారింది. ఈ ఆరోపణలపై మంత్రి గానీ, కాంగ్రెస్ నాయకులు గానీ స్పందించకపోవడం ప్రజల్లో అపనమ్మకాన్ని మరింత పెంచుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర రాజకీయ పరిణామాలపై ఈ వివాదం తీవ్ర ప్రభావం చూపుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఆరోపణల నుంచి ఎలా బయటపడతారు? హుస్నాబాద్లో కాంగ్రెస్ ప్రతిష్టను ఎలా కాపాడుకుంటుంది? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.