calender_icon.png 31 May, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ కలప తరలిస్తున్న వ్యక్తికి రిమాండ్

30-04-2025 11:38:16 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అక్రమ టేకు కలప తరలిస్తున్న వ్యక్తికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా జడ్జి ఎం.వి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిర్యాని అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ఆసిఫాబాద్ మండలంలోని కోసర నుండి ఆసిఫాబాద్ మీదుగా ఐబితాండూర్ కు అక్రమంగా కారులో టేకు కలప తరలిస్తున్న ఐబితాండూర్ కు చెందిన ఏలేశ్వరం తిరుపతినీ వెంబడించి తాండూర్ వద్ద పట్టుకున్నారు.

నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారించగా తనకు ఐబిలో వైభవ్ టింబర్ డిపో ఉన్నట్లు తెలుపడంతో పాటు, తరచు కోసర గ్రామానికి చెందిన అజ్మీర గణపతి వద్ద అక్రమ టేకు కలపను తరలిస్తానని ఒప్పుకున్నట్లు వివరించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. అయితే అజ్మీర గణపతి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. కారులో 17 దుంగలు దొరకగా పట్టుబడిన కలప విలువ 46,665 రూపాయలుగా ఉందన్నారు. అక్రమంగా కలప తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ అధికారి ఇక్బాల్ మోహినోద్దీన్, సెక్షన్ అధికారులు విజయప్రకాష్, మహేందర్, బీట్ అధికారులు అనిల్, ప్రకాష్, శ్రీకాంత్, సాధిక్ పాల్గొన్నారు.