23 May, 2026 | 7:07 PM

Breaking News

కొయ్యగుట్ట అమరవీరుల స్థూపానికి మరమ్మతులు చేపట్టండి   •   డబిల్ పూర్‌లో కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పర్యటన   •   తాళం వేసి ఉన్న ఇల్లులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్   •   తప్పులు మీరు చేసి నిందలు మాపై వేయడం సరికాదు   •   రామాయంపేటలో విషాదం.. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల అండ   •   కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •  

కామారెడ్డిలో దాడుల ఘటనకు కారణమైన వ్యక్తి అరెస్టు

04-10-2025 07:49 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): పాత కక్షను మనసులో పెట్టుకొని దాడి చేసిన వ్యక్తిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఏఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలను వెల్లడించారు. కామారెడ్డి పంచముఖ హనుమాన్ కాలనీకి చెందిన కేతన్, రకుల్ అనే ఇద్దరు యువకులపై సిద్ధార్థ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు.

దసరా రోజు అర్ధరాత్రి దాండియా వద్ద జరిగిన దాడి నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైన సిద్ధార్థ్ అనే యువకుడ్ని అరెస్టు  చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ తెలిపారు. దసరా రోజు అర్ధరాత్రి పోలీసులకు 100 డయల్ కాల్  వచ్చినట్లు తెలిపారు. వెంటనే తమ సిబ్బంది గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగా అక్కడ రెండు గ్రూపు లు కొట్టుకున్నట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యుడైన సిద్ధార్థ ను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు తెలిపారు.