15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

మండల స్థాయి సియం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

29-01-2026 04:31 PM

మఠంపల్లి జనవరి 29:సూర్య పేట మఠం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భీల్యా నాయక్ తండ నందు సియం కప్ -2025-26 మండల స్థాయి  క్రీడ పోటీలకు ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి కె.వెంకటాచారి,స్థానిక గ్రామ సర్పంచ్ బానోతు రాముడు నాయక్ హాజరై ప్రారంభించినారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.రాము  మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని, దేహదారుడ్యాన్ని పెంపొందిస్తాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరిసర గ్రామ సర్పంచులు గోవింద నాయక్ చిరంజీవి,ఉపసర్పంచులు,సెక్రటరీలు,గ్రామ పెద్దలు, వెంకటేశ్వరరావు,స్థానిక పాఠశాల పిడి ఎమ్.నరేష్,వివిధ పాఠశాలల పిడి లు,పిఇటి లు, ఉపాధ్యాయులు క్రీడాకారులు యువత తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న వివిధ గ్రామాల నుండి హాజరైన క్రీడాకారులకు స్థానిక సర్పంచ్ బానోతు రాముడు నాయక్  ప్రైజులు,భోజన వసతి  వివిధ రకాల మౌలిక సదుపాయాలు మొత్తం ఆయనే కల్పించినారు.