14-09-2025 06:54:21 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): చత్తీస్గడ్ ఎన్కౌంటర్లో మృతి చెందిన అలియాస్ విమల్ మృతదేహం ఆదివారం సాయంత్రం చంద్రారెడ్డి గ్రామానికి చేరింది. వెంకటి మృతదేహానికి గ్రామంలో విరసం, అమరుల బంధుమిత్రుల కమిటీ, గ్రామస్తులు విప్లవ నివాళుల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. నిర్వహించారు. వెంకటి మృతదేహంపై ఎర్రజెండాలు కప్పి విప్లవద్యమంలో అతని సేవలను స్మరించుకున్నారు. అంతిమయాత్రలో ప్రజలు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు.