25-07-2025 08:07:16 PM
నిర్మల్,(విజయక్రాంతి): పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహిస్తున్న వంట కార్మికులకు ప్రభుత్వం ప్రతినెల గౌరవితరాన్ని విడుదల చేయాలని పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఏఐటియుసి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జెసి కిషోర్ కుమార్ కు వినతిపత్రం అందించారు. గౌరవ వేతనం ఇవ్వకపోవడంతో బిల్లు రాకపోవడం వల్ల వంట కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముఖ్య రమేష్ ఎస్ఎన్ రెడ్డి భోజన్న ఉమా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.