జార్ఖండ్లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోయిస్టులు మృతి
గుమ్లా: జార్ఖండ్లోని(Jharkhand) గుమ్లా జిల్లాలో శనివారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు(Maoists) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సీపీఐ (మావోయిస్టు)లో చీలిక గ్రూపు అయిన జార్ఖండ్ జన ముక్తి పరిషత్ (Jharkhand Jan Mukti Parishad) సభ్యులు ఘాగ్రా అడవిలో గుమిగూడి భద్రతా దళాలపై దాడికి ప్రణాళిక వేస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం అందాయని తెలిపారు. ఈ సమాచారం మేరకు జార్ఖండ్ జాగ్వార్, గుమ్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. రెండు వైపుల నుండి ఎదురుకాల్పుల్లో అనేక రౌండ్ల బుల్లెట్లు కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత సంఘటనా స్థలం నుండి ఒక ఏకే-47, రెండు ఐఎన్ఎస్ఏఎస్(INdian Small Arms System) రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జార్ఖండ్ పోలీస్ ఐజీ (ఆపరేషన్స్) మైఖేల్ ఎస్. రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అన్నారు.






