11 April, 2026 | 1:18 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

విద్యుత్ షాక్ తో వలస కూలీ మృతి

25-12-2025 01:34 PM

వాంకిడి,(విజయక్రాంతి): ఉపాధి కోసం పక్క రాష్ట్రం నుంచి వలస కూలీ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన వాంకిడి మండలంలో(Wankidi Mandal) చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని రాజుర కోనత్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ తులసీరాం నికోడే (22) బుధవారం భవన నిర్మాణ పనుల నిమిత్తం వాంకిడి మండలానికి వచ్చాడు. ఈ క్రమంలో గోయగాం గ్రామానికి చెందిన మాడావి వాసుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలు ఇనుప పైపును తాకడంతో గౌరవ్‌కు విద్యుత్ షాక్ తగిలింది.

తక్షణమే అతడిని వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆసిఫాబాద్‌కు రిఫర్ చేయడంతో హుటాహుటిన తరలించారు. క్షతగాత్రుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందకపోవడమే గౌరవ్ తులసీరాం మృతికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. వాంకిడి ప్రభుత్వ దవాఖానాకు తీసుకువచ్చిన అనంతరం సుమారు గంటపాటు ఎవరూ పట్టించుకోలేదని, వైద్యులు కూడా అందుబాటులో లేరని వారు వాపోయారు.