2 June, 2026 | 7:44 PM

Breaking News

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •  

విద్యుత్ షాక్ తో వలస కూలీ మృతి

25-12-2025 01:34 PM

వాంకిడి,(విజయక్రాంతి): ఉపాధి కోసం పక్క రాష్ట్రం నుంచి వలస కూలీ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన వాంకిడి మండలంలో(Wankidi Mandal) చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని రాజుర కోనత్‌పూర్ గ్రామానికి చెందిన గౌరవ్ తులసీరాం నికోడే (22) బుధవారం భవన నిర్మాణ పనుల నిమిత్తం వాంకిడి మండలానికి వచ్చాడు. ఈ క్రమంలో గోయగాం గ్రామానికి చెందిన మాడావి వాసుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ పనులు నిర్వహిస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలు ఇనుప పైపును తాకడంతో గౌరవ్‌కు విద్యుత్ షాక్ తగిలింది.

తక్షణమే అతడిని వాంకిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఆసిఫాబాద్‌కు రిఫర్ చేయడంతో హుటాహుటిన తరలించారు. క్షతగాత్రుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సకాలంలో వైద్యం అందకపోవడమే గౌరవ్ తులసీరాం మృతికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. వాంకిడి ప్రభుత్వ దవాఖానాకు తీసుకువచ్చిన అనంతరం సుమారు గంటపాటు ఎవరూ పట్టించుకోలేదని, వైద్యులు కూడా అందుబాటులో లేరని వారు వాపోయారు.