18-07-2025 12:00:00 AM
హుజూర్ నగర్, జూలై 17 : రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు హుజూర్ నగర్ రానున్నట్లు మంత్రి కార్యాలయ పిఆర్ఓ వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హుజూర్ నగర్ మండల పరిధిలోని లింగగిరి గ్రామానికి చెందిన మాజీ జెడ్పిటిసి ఎండి ఫాతిమా భర్త మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి నిజాముద్దీన్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం విధితమే. కాగా పట్టణంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో నేడు జరగనున్న ఆయన సంతాప సభకు హాజరవుతారని పేర్కొన్నారు.