calender_icon.png 2 May, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

02-05-2025 12:31:49 PM

నేరడిగొండ,(విజయక్రాంతి): పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నగదు ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Boath MLA Anil Jadhav) అన్నారు. బోథ్ నియోజకవర్గ పరిధిలో ని లబ్దిదారులకు మంజూరైన  రూ. 2,42,000/- విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను  నేరడిగొండ లో ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తలమడుగు మండలంలోని ఉండం గ్రామానికి చెందిన చోటే ఖాన్ కి మంజూరు అయిన రూ. 45,000, నేరడిగొండ మండలంలోని తర్నం గ్రామానికి చెందిన కామెరి రాజేశ్వర్ కి రూ. 27,000, ఇచ్చొడ మండలంలోని ఆడిగావ్ (బి) కి చెందిన సావు బాయి కి రూ. 60,000,  సోనాల మండల కేంద్రానికి చెందిన బొరిగేపు సుశీల కి రూ. 16,500,  బోథ్ మండలంలోని దన్నూర్ (బి) గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి కి రూ. 25,500, రవి కి రూ. 41,500, నల్ల రాజేశ్వర్ రెడ్డి కి రూ. 16,500, ముసుకు రాజేశ్వర్ రెడ్డి కి రూ. 10,000 చెక్కు లను ఎమ్మెల్యే  లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, యువ నాయకులు దేవేందర్ రెడ్డి, అభిరాం రెడ్డి, శ్రీధర్ రెడ్డి, జక్క శ్రీధర్ రెడ్డి, దివాకర్ రెడ్డి, రాజు, ఉన్నారు.