08-07-2025 06:07:57 PM
బోథ్ (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) కలిసారు. మంగళవారం హైదరాబాద్ లోని నందినగర్ లో గల వారి నివాసంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.