calender_icon.png 7 June, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసమస్యలపై దరఖాస్తులు నిరంతరం సేకరించాలి

07-06-2025 12:21:45 AM

సీపీఎం డిమాండ్ 

హుజూర్ నగర్, జూన్ 6: రెవెన్యూ గ్రామాలలో భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలపై స్వీకరిస్తున్న దరఖాస్తులను నిరంతర ప్రక్రియగా కొనసాగించి దరఖాస్తులను స్వీకరించాలని సిపిఎం మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ కోరారు.

శుక్రవారం హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులో కొందరు రైతులు సమయానికి దరఖాస్తులు ఇవ్వలేక పోయారని అలాంటి వారి కోసం రెవెన్యూ సదస్సులు పూర్తిచేసుకున్న గ్రామాలలోని రైతులు భూ సమస్యలపై ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు మరో అవకాశం ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ నాగార్జున రెడ్డి కి రైతులు దరఖాస్తులను అందించారు.ఈ కార్యక్రమంలో బాల సైదులు, వీరస్వామి, నాగమణి,రాములు,సైదులు తదితరులు పాల్గొన్నారు.