26-07-2024 12:21:28 PM
హైదరాబాద్: ఇప్పటికైనా కేసీఆర్ వాస్తవాలు గ్రహించాలి, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు కోరాలని కాంగ్రెస్ పార్టీ సీనియ్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశం డిమాండ్ చేశారు. తుమ్మడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని జీవన్ రెడ్డి కోరారు. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లతో బ్యారేజీ నిర్మాణం చేయాలని ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు.