09-05-2025 08:41:26 PM
జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర
కామారెడ్డి,(విజయక్రాంతి): సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపా రు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరికి గురైన 130 మొబైల్ ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా ( సుమారు 20 లక్షల విలువగల) సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన ,చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్ళి దరఖాస్తు ఇవ్వాలన్నారు. SIM కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త SIM తీసుకోవాలని తెలిపారు.
పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు CEIR వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వలన పోగొట్టుకున్న మొబైల్ సులబంగా దొరికే అవకాశం ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయములో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేయడం జరగిందని తెలిపారు. గత మూడు రోజులలో ఈ టీం అధికారులు 130 సెల్ఫోన్ లను రికవరీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా 130 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలిజేయడం జరుగుతుందన్నారు. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి RSI బాలరాజును సంప్రదించి (8712686114) ఫోన్ కు సంభంధించిన వివరాలు చూపించి బాధితులు సెల్ ఫోన్లు తీసుకోవాలని సూచించారు.