calender_icon.png 10 May, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రికి పూర్వ వైభవం..

09-05-2025 08:44:57 PM

వైద్య నిపులతో సేవలు

ఆధునిక వైద్య పరికరాలు

ఇకనుంచి అన్ని రకాల వైద్య సేవలు

డివైసీఎంఓ మధుకుమార్

బెల్లంపల్లి అర్బన్,(విజయ క్రాంతి): బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి మంచి రోజులు దరిచే రాయి. అత్యధిక పరికరాలు,వైద్య నిపుణులతో ఇకనుంచి కార్మిక కుటుంబాలకు వైద్య సేవలు అందరూ ఉన్నాయి. ఇటీవలనే నూతనంగా బాధ్యతలు చేపట్టిన సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ సింగరేణి ఆసుపత్రుల పూర్వైభానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ఇటీవలనే బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ గా బాధ్యతలు చేపట్టిన మధుకుమార్ పూర్తిస్థాయిలో వైద్య సేవలతో బెల్లంపల్లి ఆసుపత్రిని తీర్చిదిద్దడంపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి ఆవరించనున్న మహర్దశను శుక్రవారం బెల్లంపల్లి డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ మధు కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాను బెల్లంపల్లికి బదిలీపై వచ్చి బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏరియా ఆసుపత్రి అన్ని విషయాల్లో అధ్వానంగా తయారైందని వాపోయారు. ఒక ప్రణాళిక బద్ధంగా ఆసుపత్రిని అన్ని విధాలుగా తీర్చిదిద్దడంపైదృష్టి పెట్టానన్నారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి పూర్వ వైభవం కల్పించడమే తన ప్రధాన ఉద్దేశంగా పనిచేస్తున్నాని పేర్కొన్నారు. కార్మిక కుటుంబాలకు వైద్యo విషయంలో ఏ విధమైన లోటు లేకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు సింగరేణి ఆసుపత్రిలో ఇకనుంచి ఉంటాయన్నారు.

వైద్య నిపుణులతో మెరుగైన వైద్య సేవలు కార్మికుల పొందుతారన్నారు. అన్ని రకాల వైద్య నిపుణుల సేవలు కార్మికులకు అందిస్తామన్నారు. వైద్యుల కొరత త్వరలోనే తీరిపోతుందన్నారు. వైద్యనిపుల సేవలు ప్రతి మంగళ, శుక్రవారం అందుబాటులో బెల్లంపల్లి ఆస్పత్రిలో ఉంటాయన్నారు. డిప్యూటేషన్ పై ఇంకా పలువురు వైద్యులను రప్పిస్తున్నామన్నారు. మెరుగైన వైద్య సేవల కోసం రెఫర్ సేవలు కూడా ఉంటాయన్నారు. గైనకాలజిస్ట్, జనరల్ ఫిజీషియన్, మానసిక వైద్య, ఇతర వైద్య నిపుణుల సేవలు ఆసుపత్రిలో రోగులకు అందుతాయన్నారు.

సింగరేణి సీఎమ్ఓ కిరణ్ రాజ్ బెల్లంపల్లి ఏరియా జిఎం విజయ్ కుమార్ రెడ్డి బెల్లంపల్లి ఆసుపత్రి  వైద్య సేవలకి ఎలాంటి లోటు లేకుండా తగిన చేయూతను ఇస్తున్నారన్నారు. ఇప్పటికీ బెల్లంపల్లి ఆస్పత్రిలో పదిమంది వైద్యులు, 90 మంది సిబ్బంది ఉన్నారన్నారు. ఇంకా వైద్యులు, వైద్య సిబ్బంది వస్తారన్నారు. అన్ని వైద్య రంగాల్లో ఆధునికవైద్య పరికరాలను ఆసుపత్రిలో సమకూర్చినట్టు పేర్కొన్నారు. బెల్లంపల్లిలో ఉంటూనే వివిధ దూర ప్రాంతాల గనుల పని చేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలు  24 వేల మంది వరకు ఉంటారన్నారు. యావత్తు కార్మికులు, వారి కుటుంబాలకి వైద్య సేవలు బెల్లంపల్లిలో పొందుతున్నారన్నారు.