calender_icon.png 24 June, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొల్లారంలో మోడల్ పోలీస్‌స్టేషన్

16-06-2025 12:00:00 AM

- రూ.3.50 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో పనులు

- శంకుస్థాపన చేసిన ఎంపీ రఘునందన్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి 

పటాన్ చెరు, జూన్ 15 :  బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 248లో ఎకరా స్థలంలో హెటిరో పరిశ్రమ సౌజన్యంతో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు ఆదివారం ఉదయం మెదక్ ఎంపీ రఘునందన్ రావు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఐజి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలన్న లక్ష్యంతో నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని తెలిపారు. గుమ్మడిదలలోను  హెటిరో పరిశ్రమ  సౌజన్యంతో రూ.2.50 కోట్లతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమీన్ పూర్, పటాన్ చెరు, కొల్లూరు పోలీస్ స్టేషన్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

నిరు పేద, కార్మికులు, మధ్యతరగతి ప్రజలు నివసించే పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలతో పాటు సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.  పటాన్ చెరు నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న హెటిరో పరిశ్రమ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో రవీందర్ రెడ్డి,  పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, హెటిరో పరిశ్రమ డైరెక్టర్ జీ. మోహన్ రెడ్డి,  వైస్ ప్రెసిడెంట్ రవి బాబు, సీఎస్‌ఆర్ హెడ్ సుధాకర్, అరుణ్, రామారావు, సీఐలు వినాయక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి గౌడ్, నరేష్, నయిమొద్దీన్, లాలు నాయక్,  బొల్లారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి,  జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి, నాయకులు చంద్రా రెడ్డి, హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఖాజీపల్లి నవీన్, వరప్రసాద్ రెడ్డి, వేణుపాల్ రెడ్డి, యాదిరెడ్డి,  తదితరులుపాల్గొన్నారు.