14 July, 2026 | 4:54 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

సమస్యలు పరిష్కరించేందుకే మార్నింగ్ వాక్..

16-09-2025 03:26 PM

మున్సిపల్ కమిషనర్ యాదగిరి..

తాండూరు (విజయక్రాంతి): తాండూర్ మున్సిపల్ పరిధిలో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ యాదగిరి(Municipal Commissioner Yadagiri) అన్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయన శానిటరీ ఇన్స్పెక్టర్, సిబ్బందితో కలిసి ఇందిరానగర్ ప్రాంతం ఐదు ఆరు వార్డుల్లో పర్యటించారు. మురుగు కాల్వలో ఉన్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. వీధి దీపాలు, తాగునీరు వార్డుల్లో సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. భారీగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు  ప్రబలకుండా ప్రజలు పరిసరాల శుభ్రత పాటించాలని దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నీరు నిల్వ ఉన్నచోట జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.