16-09-2025 04:59:07 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన రైతు దేవయ్య మానేరు వాగులో చిక్కుకోగా జిల్లా DRF టీంలోని కానిస్టేబుల్ సురేందర్ ధైర్యసాహసంతో తక్షణమే స్పందించి రైతును సురక్షితంగా రక్షించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్. కార్యాలయంలో కానిస్టేబుల్. సురేందర్ను అభినందించి, ఆయన చూపిన కర్తవ్యనిబద్ధత, ప్రజాసేవ భావానికి గుర్తింపుగా ప్రశంస పత్రం అందజేసి “ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు లెక్కచేయకుండా పనిచేసే పోలీసు సిబ్బంది సమాజానికి ఆదర్శప్రాయులు అని కొనియాడారు.