26 June, 2026 | 5:56 PM

జనగాంలో తల్లి, కూతురు హత్య

08-08-2025 12:51 PM

హైదరాబాద్: జనగాం జిల్లా(Jangaon) జాఫర్‌ఘడ్ మండలం తుమ్మడపల్లి () గ్రామంలో శుక్రవారం ఇద్దరు మహిళలు, 75 ఏళ్ల తల్లి, ఆమె 45 ఏళ్ల కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. బాధితులు ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు దుండగులు దాడి చేశారు. నేరం చేసిన తర్వాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలు చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.