5 May, 2026 | 1:49 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

బెజ్జంకిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు

08-08-2025 04:39 PM

పిఎసిఎస్ వద్ద ఉదయం నుంచి రైతుల పడిగాపులు..

వ్యవసాయ పనులు వదులుకొని యూరియా కోసం రోజుల తరబడి పరుగులు..

బెజ్జంకి: బెజ్జంకి పరిసర ప్రాంత రైతులకూ యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా బస్తాల కోసం రైతులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. బెజ్జంకి వ్యవసాయ పిఎసిఎస్ మార్కెట్‌ యార్డులో ఉన్న గోడౌన్‌ వద్దకు శుక్రవారం ఉదయం నుంచే రైతులు వచ్చి పడికాపులు కాస్తుండడం యూరియా కొరతకు అద్దం పడుతోంది. నాట్లేసి నెల రోజులైనా యూరియా రాక ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లోడ్‌ వచ్చిన విషయం తెలుసుకున్న గ్రామ రైతులు బారులు తీరారు. ఒకే లోడు వచ్చిందని, మళ్లీ లోడ్‌ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఒక ఎకరానికి ఒక బస్తా ఇవ్వగా, చాలా మంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.