15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారంలో ఎంపీ, ఎమ్మెల్యే

05-11-2025 07:41 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా బుధవారం బోరబండ డివిజన్ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఉప ఎన్నికల ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటిని సందర్శన చేస్తూ ప్రజలతో మమేకమై, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పథకాలను వివరించారు.

నవంబర్ 11న జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ప్రజలు ఐక్యంగా ఓటు వేసి నవీన్ యాదవ్ ని ఘన విజయం సాధింపజేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ జనహితమే మా ధ్యేయం. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పతాకం ఎగరనుంది. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే హస్తం గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.