16-09-2025 08:03:42 PM
నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల దుర్గమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి చిత్రపటానికి మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలువేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట కట్టంగూరు మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి సుంకరబోయిన నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు , రెడ్డిపల్లి సాగర్, మిట్టపల్లి శివ రెడ్డిపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.