6 May, 2026 | 11:55 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

రోటరీ క్లబ్ సేవలు ప్రజలకు ఎంతో మేలు

16-09-2025 08:17 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రోటరీ క్లబ్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో మంగళవారం పీపమంగళవారంఇండియా వారి సహకారంతో  దివ్యాంగులైన పిల్లలకు వీల్ చైర్స్, బెడ్స్ పంపిణి చేశారు. స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారు పీపుల్స్ ఫర్ ఇండియా వారి సహకారంతో  మంగళవారం గర్గుల్ ప్రాంతంలోని దివ్యాంగులైన పిల్లలకు వీల్ చైర్స్, బెడ్స్ నిపంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిధిగా విచ్చేసినటువంటి దేవుని పల్లీ ఎస్సై రంజిత్, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, సదాశివనగర్ విద్యాశాఖ అధికారి యోసెఫ్  మాట్లాడుతూ...మంగళవారం స్థానిక రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో పీపుల్ ఫర్ ఇండియా వారి సహకారంతో గర్గుల్ లో దివ్యాంగులైన పిల్లలకు నేడు వీల్ చైర్స్, బెడ్స్ పంపిణీ చేయడం వలన వారి కనీస సౌకర్యాలకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్సై రంజిత్ , విద్యాశాఖ అధికారి యోసెఫ్  ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి వారు ఎల్లప్పుడు నిర్వహిస్తారని దీని ద్వారా చాలామంది ప్రజలకు  మేలు కలుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రంజిత్ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి ఎంఈఓ యూసఫ్, రోటరీ ప్రెసిడెంట్ శంకర్,  సెక్రటరీ కృష్ణహరి,  రమేష్, రోటరీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.