6 May, 2026 | 7:53 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

ఏఈవో లేక పంట నమోదుకు ఆటంకం

16-09-2025 08:00 PM

కుభీర్: మండల కేంద్రం కుబీర్ కు వ్యవసాయ విస్తీర్ణ అధికారి గత కొంతకాలంగా  లేకపోవడంతో పంట నమోదు ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీంతో మండల కేంద్రానికి చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు.  సోయా కోతకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికీ ఇంకా పంట నమోదు ప్రక్రియను ప్రారంభించకపోవడం పట్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదు. మండలంలో కుబీర్ తో పాటు సోనారి,పల్సి, కసర, డోడర్న, పార్డి బీ చాత, Closing, నిఘ్వా  9 క్లస్టర్లు ఉన్నాయి.

అన్ని క్లస్టర్లకు ఏఈవోలు ఉండగా  మండల కేంద్రమైన కుబీర్ కు ఏఈవో లేకపోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు, రైతు నాయకులు ఏవో సారికను కలిసి ఏవో ను నియమించాల్సిందిగా వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఏవో ను నియమించకపోవడం తో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంట నమోదు ప్రక్రియ చేపట్టే విధంగా కుబీర్కు ఏఈఓ ను నియమించాలని రైతులు కోరుతున్నారు.