21-08-2025 08:14:18 PM
నకిరేకల్ (విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో గురువారం నెలవారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ కమిషనర్ ఏ. రంజిత్ కుమార్(Municipal Commissioner Ranjith Kumar), దేవాలయ చైర్మన్ పన్నాల రాఘవరెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చౌగోని రాములమ్మ సైదులు, యసారపు లక్ష్మివెంకన్న, పోతుల సునిత-రవీందర్, గాజుల సుకన్య, రాచకొండ సునిల్, ప్రతినిధులు గంగాధర పద్మావతి, సాకుంట్ల నర్సింహ్మ, బుచ్చిబాబు, శంకర్ పాల్గొన్నారు.