05-07-2025 12:00:00 AM
జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
రాజాపూర్ జులై 4: ఓటర్ జాబితా ఓటర్ నమోదు వంటి అంశాలపై బిఎల్ఓ లకు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం మం డల కేంద్రంలోని రైతు వేదిక లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.సమావేశం లో మండల స్థాయిలో ఆయా గ్రామాల పోలింగ్ స్టేషన్లలోని బూత్ లెవల్ అధికారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తసీల్దార్ రాధాకృష్ణ,సూపర్వైజర్ శ్రీనివాస్,ఏ ఎస్ ఓ శ్రీకాంత్,ఆర్ ఐ మంజుల, యాదయ్య ,బి ఎల్ ఓ లు తదితరులు పాల్గొన్నారు.