calender_icon.png 7 July, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు

06-07-2025 08:37:32 PM

భక్తులతో కిక్కిరిసిన ఆలయం..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా(Suryapet District) జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారాయణ స్వామి మహాక్షేత్రంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమాన్, శ్రీ రామకోటి స్తూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. మధ్యాహ్నం అన్నప్రసాద సత్రంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాకులారపు రజిత, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, మణికంఠ, వడ్లకొండ జానకీ నిరంజన్, అర్చకులు భీంపాండే, వికాస్ పాండే తదితరులు పాల్గొన్నారు.