1 April, 2026 | 7:16 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముత్త సాంబరాజు

22-01-2026 03:11 PM

తరిగొప్పుల, జనవరి 22 (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వగలబోయిన యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా ముత్తా సాంబరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా నీల రాజు, యూత్ అధ్యక్షులుగా, నీల సంపత్, ఉపాధ్యక్షులుగా బండారి ప్రశాంత్, ఎన్ ఎస్ ఐ అధ్యక్షులుగా మండల రాజు, బీసీ సెల్ అధ్యక్షులుగా బాలగోని శీను ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు.తమ పై నమ్మకం తో బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీ, మండల కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అర్జుల పోసిరెడ్డి, ప్రధాన కార్యదర్శి పింగిలి ఇంద్రారెడ్డి, భీమ నాయక్, సర్పంచ్ కావటి సుధాకర్, భాష బోయిన రమేష్, సూర్య నాయక్, కాసాని గాలయ్య, భాష బోయిన సురేష్, తదితరులు పాల్గొన్నారు.