17 April, 2026 | 3:29 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రతిఒక్కరూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నదే నా ఆకాంక్ష

12-05-2025 12:40 AM
  1. దేవుడ్ని కూడా అదే కోరుకున్నా

రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

శంకరగిరి తండాలో శిఖర, ధ్వజ ప్రతిష్టా మహోత్సవానికి హాజరు

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 11 (విజయక్రాంతి)ప్రతీ ఒక్కరూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నదే తన ఆకాంక్ష అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పే ర్కొన్నారు.  ఆదివారం నేలకొండపల్లి మండ లం శంకరగిరి తండాలో జరిగిన శ్రీ సీతారా మ లక్ష్మణ, ఆంజనేయ, శిఖర, ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ...  ప్రజలందరూ ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని, వివిధ రంగాల్లో ఉన్న వారందరినీ ఉన్న త శిఖరాలకు చేర్చాలని దేవుణ్ణి కోరుకున్న ట్లు తెలిపారు.  అనంతరం మంగాపురం తం డా తదితర ప్రాంతాల్లో జరిగిన వివాహ వేడుకల్లో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని నూతన వధూవరులను ఆశీర్వదించి, పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు.