6 July, 2026 | 3:55 PM

Breaking News

విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •  

రౌడీలా వ్యవహరిస్తున్న మైనంపల్లి

17-07-2025 01:48 AM

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి, జులై 16 : కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు రౌడీల వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు.  బోనాల చెక్కులు పంపిణీ సందర్భంగా జరిగిన ఘర్షణ అంశంపై ఆయన బుధవారం బో యినపల్లిలో  ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మైనంపల్లి హను మంతరావు కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా ఒక పొలిటికల్ నయీమ్ గా వ్యవహరిస్తున్నాడని, దౌర్జన్యాలు, గుండాయిజం, ల్యాండ్ కబ్జాలు, సెటిల్మెంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలపై చేయిబడితే ఊరుకునేది లేదని, కార్యకర్తలను కాపాడుకునేందుకు  ఎంతవరకు అయినా వెళ్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మైనంపల్లి ఒక రౌడీలా నయీమ్ తరహాలో వ్యవహరిస్తున్న తీరుకు ఆయనను పూర్తిస్థాయిలో ఎదుర్కొనటానికి సిద్ధంగా ఉన్నానని, ఇకపై ఎన్నికలు ఎలాంటివైనా మైనంపల్లి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ  పోటీ చేస్తానని, ఎటువంటి పరిస్థితుల్లో మైనంపల్లిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు.

కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావులపై అసబంధమైన ఆరోపణలు చేయటం కాదని, మెదక్ లో ఆడబిడ్డ పద్మ దేవేందర్ రెడ్డిపై ప్రతాపం చూపించడం కాదని, స్థానికంగా ఆయన ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్కాజిగిరి నియోజకవర్గంలో తనని దమ్ముంటే ఎదుర్కోవాలని మైనంపల్లి హనుమంతరావుకి మర్రి రాజశేఖర్‌రెడ్డి సవాల్ విసిరారు.