6 July, 2026 | 2:52 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

సీసీఎస్ అదుపులో రిటైర్డ్ ఐఏఎస్ ఆర్పీసింగ్

17-07-2025 01:48 AM
  1. ఖజాగూడ భూవివాదంలో ఐ-టవర్ నిర్మాణ సంస్థ ఫిర్యాదు
  2. గిఫ్ట్ డీడ్ విషయాన్ని దాచి, భూమి తనదేనంటూ డెవలప్‌మెంట్ ఒప్పందం
  3. నిలిచిపోయిన కమర్షియల్ కాంప్లెక్స్..
  4. 700 మంది కొనుగోలుదారుల ఆందోళన

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 16 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఓ భూవి వాదంలో ఏపీ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీసింగ్‌ను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖజాగూడలోని అత్యంత విలువైన స్థలానికి సంబంధించి, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థను మోసం చేశారన్న ఫిర్యాదు మేరకు బుధవారం అతడి నివాసంలో అదుపులోకి తీసుకొని, విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఖాజాగూడలోని సర్వే నంబర్ 19లో ఉన్న 10 ఎకరాల 32 గుంటల భూమి తమదేనని ఆర్పీ సింగ్, ఆయన భార్య హర్విందర్ సింగ్ చెబుతున్నారు. ఈ స్థలంలో ఒక భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం వారు ఐ-టవర్ అనే నిర్మాణ సంస్థతో డెవలప్‌మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ప్రకారం నిర్మాణం ప్రారంభించిన ఐ-టవర్ సంస్థ, ప్రాజెక్టు కోసం బ్యాంక్ లోన్‌కు దరఖాస్తు చేసింది.

ఈ క్రమంలో బ్యాంక్ అధికారుల పరిశీలనలో విషయం బయటపడింది. ఒప్పందం చేసుకున్న మొత్తం స్థలంలో 3 ఎకరాల 24 గుంటల భూమి ఆర్పీ సింగ్ కుమార్తె పేరిట గిఫ్ట్ డీడ్‌గా ఉన్నట్టు తేలింది. ఈ విషయాన్ని ఐ-టవర్ యాజమాన్యం వెంటనే ఆర్పీ సింగ్ దృష్టికి తీసుకెళ్లగా, తమ కుమార్తె అమెరికాలో ఉందని, గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేస్తామని వారు చెప్పినట్టు  సమాచారం.

అయితే, ఇంత కీలకమైన విషయాన్ని ఒప్పందం సమయంలో దాచిపెట్టి, తమను మోసం చేశారని ఆరోపిస్తూ ఐ-టవర్ యాజమాన్యం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు తీవ్రత దృష్ట్యా, దర్యాప్తును సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు.

బాధితుల ఆందోళన..

ఈ వివాదం కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ప్లాట్లను కొనుగోలు చేసిన దాదాపు 700 మంది కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణం పూర్తి కాకపోవడం, బ్యాంకు లోన్లు కూడా రాకపోవడంతో తాము నష్టపోయామని వాపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగి ఆర్పీ సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.