calender_icon.png 1 May, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం మండలం ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన ఆణిముత్యాలు

01-05-2025 12:00:00 AM

 నాగారం ఏప్రిల్ 30: ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన నాణ్యమైన విద్యా విధానాన్ని అమలవుతుందని మండల విద్యావనరుల అధికారి వాసం ప్రభాకర్ అని అన్నారు.  ఆయన మాట్లాడుతూ మార్చి 2025 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో నాగారం మండలం మహాత్మా రావ్ జ్యోతిబాపూలే పాఠశాల నుండి 568  బి నందకుమార్ , 551 ఎస్ హర్షవర్ధన్ 549  బి నిశ్వంత్   జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి ఫణిగిరిలో పి పూజ 545 పసునూరి ఆదర్శ పాఠశాల  జె శివ గణేష్ 545  జడ్పీహెచ్‌ఎస్ ఈటూరు  మేడబోయిన ప్రశాంత్ 541 .ప్రైవేట్ పాఠశాల మేరీ మదర్ నుండి 559 మార్కులతో సాయిశ్రీ  554  లక్ష్మీ ప్రసన్న  553 బండ గొర్ల శ్రావణి మూడవ ర్యాంకులో ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల కు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అని అన్నారు . ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందాలు అభినందించారు.