20 June, 2026 | 4:09 PM

Breaking News

గతంలో విద్యావ్యవస్థను కేసీఆర్ పాడుచేస్తే… ప్రస్తుతం రేవంత్ సర్కార్ చంపేస్తోంది   •   పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •  

వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా కుట్ర

15-10-2025 12:00 AM

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్

ఆదిలాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల్లో ఐక్యతను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో చేపట్టిన ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మంగళవారం ఆదిలాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ పాలిత ప్రాంతాల్లో వర్గీకరణ అమలు చేయకుండా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అమలు చేయడం సరికాదని, 59 కులాలున్న ఎస్సీలకు నాలుగు శాతం రిజర్వేష న్ ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జాతీయస్థాయిలో చేపట్టే వర్గీకరణ వ్యతిరేక ఉద్య మానికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు బల్లెం లక్ష్మణ్, ప్రభాకర్ రావు, బాలశౌరి,శరత్,ప్రేమ్ బాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.