నయనతార పారితోషికం 10 కోట్లు?

27-04-2024 12:25:00 AM

నేటి సినిమాల్లో కథానాయికల ప్రాధాన్యత పెరిగింది.  ఒకప్పుడు కేవలం డ్యాన్సులు, గ్లామర్ గురించే కథానాయికలు అనే విధంగా వుండేది.కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరోలకు తీసిపోని విధంగా వాళ్ల పాత్రలను క్రియేట్ చేస్తున్నారు దర్శకులు. ఇదే బాటలో ఇప్పుడు కథానాయికల పారితోషికాలు కూడా పెరిగాయి. ఒకటి రెండు హిట్ సినిమాల్లో నటిస్తే ఆ కథానాయిక డిమాండ్ మేరకు రెండు నుంచి మూడు కోట్లు చెల్లిస్తున్నారు నిర్మాతలు.

అయితే ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న ఏంటంటే ప్రస్తుతం అత్యంత పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ ఎవరని? అయితే ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. దక్షిణాది సినీ పరిశ్రమ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్నది కథానాయిక నయనతార అంటున్నాయి చెన్నై సినీవర్గాలు. నయనతారకు వున్న క్రేజ్, డిమాండ్ మేరకు ఆమె సినిమాకు 10 కోట్ల పారితోషికాన్ని చెల్లిస్తున్నా రు నిర్మాతలు. అయితే ఇందులో కొన్ని కండిషన్స్ అప్లు కూడా వున్నాయండి.. 10 కోట్ల పారి తోషికాన్ని అందుకున్నా నయనతార సిని మాకు సంబంధించిన ఎలాంటి ప్రమో షన్స్‌లో పాల్గొనదు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధ నలు అన్ని నయనతార నిర్మాతకు ముందే చెబుతుందట.