ప్రశాంతంగా నీట్ పరీక్ష
22-06-2026 12:00 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
జిల్లాలో ఐదు సెంటర్లలో 763 మంది హాజరు
సూర్యాపేట, జూన్ 21 (విజయక్రాంతి): నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. జిల్లాలో మొత్తం ఐదు సెంటర్లలో పరీక్ష నిర్వహించేయమన్నారు. జిల్లాలో మొత్తం 908 మంది విద్యార్థులకు గాను 763 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.






