18-06-2025 10:47:52 PM
ఎంఈఓ సలీం షరీఫ్..
కోదాడ: కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం నాటికి నూతన ప్రవేశాలు 106 చేరిన సందర్భంగా కోదాడ మండల విద్యాధికారి పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం ఎండి. సలీం షరీఫ్(Mandal Education Officer MD. Salim Sharif) పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించినారు. ఇకముందు 100 నుండి 150 నూతన అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 550 నుండి 600కు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.