07-05-2024 12:37:49 AM
ఆప్కు ఖలిస్థాన్ వాదుల నుంచి భారీగా నిధులు?
ఫిర్యాదులు వచ్చాయన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
న్యూఢిల్లీ, మే ౬: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం ఆయన మెడకు చుట్టుకుని తీహార్ జైలులో ఉన్నారు. తాజాగా సిక్కు వేర్పాటువాదుల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి విరాళాలు అందాయన్న ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ జరపాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా సిఫారసు చేశారు. ఆప్కు నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ సంస్థ నుంచి భారీగా విరాళాలు అందాయని తనకు ఫిర్యా దులు వచ్చాయని ఎల్జీ వివరించారు. దీంతో కేజ్రీవాల్ మెడపై మరో కత్తి వేలాడే అవకాశం ఉంది. ఇప్పటికే కేజ్రీవాల్ను ఈడీ, సీబీఐ అరెస్టు చేసింది.
ఈ కేసులో బెయిల్ కూడా రాకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎన్ఐఏ కనుక విచారణ ప్రారంభిస్తే ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుంది. ఖలిస్థానీవాది దేవేంద్ర పాల్ భుల్లర్ను విడుదల చేయించేందుకు అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి ఏకంగా రూ.130 కోట్ల మేర ముడుపులు అందాయని ఎల్జీ తన లేఖలో పేర్కొన్నారు. 2014 ముందు కేజ్రీవాల్ ఖలిస్థానీ వేర్పాటువాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూతో అమెరికాలోని న్యూయార్క్లో సమావేశం అయ్యారని చెప్పారు.