08-06-2025 12:54:40 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణలో భాగంగా నూతన మంత్రులు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.